Monday, January 31, 2011

పాంచజన్య...పోరుబిడ్డలు

వందేమాతరం పాడిన విద్యార్థులను నైజాము బహిష్కరించాడు
జై తెలంగాణ అంటే నేడు జైల్లో పెట్టారు, బుల్లెట్లతో గాయం చేసారు
ఇంకెక్కడి స్వాతంత్ర్యము, ఇదేనా ప్రజాస్వామ్యము?

రజాకార్లను తరిమి కొట్టాము, నైజాముకు గోరీ కట్టాము
భూములు ప్రజలకు పంచాము, భారతావనిలో తిరిగి కలిసాము
గడులన్ని అదిరిపడెను, దొరలకు పంచెలు తడిసెను

పలుగు పారలు, కారం పొడులు, వడెసెలొ రాళ్ళు, రోకలి బండలు
మా చరిత్ర మరిచారా? ఘనంగా గుర్తుకు తెమ్మంటారా?
10 వేలమంది ప్రాణత్యాగంతొ సాయుదపోరాటం
నేడు 4 కోట్లమంది గుండెమంటతో ఇక ఆగదు పోరాటం...

No comments:

Post a Comment